చావడానికి వచ్చినట్టయితే.. ఎట్లా బతికుంటారు?: సీఏఏ నిరసనకారులపై యూపీ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
- యూపీలో జరిగిన ఆందోళనలో మరణించిన 20 మంది
- ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతిపక్షాలు
- హింసకు పాల్పడే వారికి అలాగే బదులిస్తామని హెచ్చరిక
సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, వాటిలో చనిపోయిన వారిని ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు సీఏఏ ఆందోళన అంశాన్ని ప్రస్తావించడంతో ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ఎవరైనా చనిపోవాలనుకుని వస్తుంటే.. వాళ్లు ఎలా బతికి ఉంటారు (అగర్ కొయి మర్నే కే లియే ఆ హీ రహా హై తో వో జిందా కహా సే హో జాయేగా)’ అని పేర్కొన్నారు. యోగి చేసిన ఈ కామెంట్లపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.